జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన పుట్టపాక వాసి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం( Narayanapur ) పుట్టపాక గ్రామానికి చెందిన సిహెచ్.

శిరీష( Sirisha ) బోధనలో మెలుకువలు పాటిస్తూ విద్యాబోధన చేయడంతోఉపాధ్యాయ దినోత్సవం ( Teachers Day )పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసంవత్సరం అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.

ప్రస్తుతం ఆమె నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలంలోని కాశవారిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటిగా విధులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె గురువారం మాట్లాడుతూ తరగతి గదిలో విద్యార్థులకు బోధనలో మెళుకువలు,విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తిని కలిగిస్తూ వారి భవిష్యత్తు కోసం కృషి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంతో గ్రామస్తులు,తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

మల్టీ లెవల్ మార్కెటింగ్(MLM) మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
Advertisement

Latest Warangal News