ఇద్దరు సమానమైన పోటిదారులు ఉంటేనే ఆటలో మజా వస్తుంది.అది పోలిటిక్స్ అయినా , క్రీడ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా.
మరి మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రధాన పోటిదారులు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే రెండు పేర్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.కొత్త రికార్డులు పుట్టాలన్నా, పాత రికార్డులు చెదిరిపోవాలన్నా ఈ ఇద్దరు రావాల్సిందే.
బాక్సాఫీస్ వద్ద అంత పోటి నెలకొని ఉంటుంది కాబట్టే .వీరి అభిమానులు ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు.అందుకే మీడియా కూడా తరుచుగా వీరిని బాక్సాఫీస్ శతృవులలా చూపిస్తూ ఉంటుంది.
ఈ పోటి గురించి అడిగే ధైర్యం తెలుగు మీడియాకి రాలేదు కాని, ప్రముఖ బాలివుడ్ క్రిటిక్, సినీ జర్నలిస్టు రాజీవ్ మసంద్ డైరెక్టుగా పవన్ కళ్యాణ్ నే మహేష్ తో శతృత్వం గురించి అడిగేశాడు.
మరి పవన్ ఏం సమాధానం చెప్పాడు? ఏమో ! ఈరోజు సాయంత్రం 6:30 అయితే తప్ప చెప్పలేం.ఎందుకంటే అప్పుడే ఆ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవబోతోంది.
సినిమాల గురించి,పొలిటిక్స్ గురించి చాలానే చెప్పాడట పవన్ ఈ ఇంటర్వ్యూ లో.కాని మొదటసారి మహేష్ బాబు మీద పెదవి విప్పనున్నాడు పవన్.ఏం చెప్పాడో అని ఉత్కంఠగా ఉన్నా, ఓపికగా ఉండాల్సిందే.







