స్మృతీ ఇరానీ ని ముఖ్యమంత్రిని చేస్తారట !

ఎంపీ గా గేలవలేక పోయినా డైరెక్ట్ కేంద్ర మంత్రి అయిపోయారు స్మృతి ఇరానీ, తలపండిన సీనియర్ లు చేపట్టే మానవ వనరుల అభివృద్ధి శాఖ ని చేపట్టిన ఆమె ఎలాంటి ఇబ్బందీ లేకుండా తొలి ప్రయత్నంలోనే మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఈ శాఖ లో .

సమర్ధమైన నాయకురాలిగా ఎదుగుతూ కేంద్ర మంత్రి స్థానంలో బాగానే రాణిస్తున్నారు.

టీవీ నటిగా ఈమె మొదటినుంచీ అందరికీ తెలిసిన వ్యక్తి .గాంధీ ఫ్యామిలీ మీద ఎన్నికల్లో పోటీ చేసి సై అనడం మాత్రమే కాకుండా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కి ముచ్చెమటలు పోయించిన సత్తా ఆమె సొంతం.తాజాగా ఆమెకు సంబంధించి మరో ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చింది.

మరికొద్ది నెలల్లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దించుతారన్నమాట బలంగా వినిపిస్తోంది.అనర్గళంగా మాట్లాడటం.తన ప్రసంగాలతో సామాన్యుల్ని విపరీతంగా ఆకర్షించేసత్తా ఉన్న ఆమె.యూపీ ప్రజలకు సుపరిచితురాలే.సార్వత్రిక ఎన్నికలలో అమేధీ లో ఓడిపోయినా కేంద్ర మంత్రి అయిన తారవాత అమేధీ కి వెళ్ళడం లాంటివి చేస్తోంది ఆమె.అక్కడ వాళ్ళతో టచ్ లో ఉంటూ అభివృద్ధి సంగతి చూసుకుంటున్నారు.ఆమెకి ప్రస్తుతం యూపీ లో బీజీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి గా ప్రకటన జారీ అయితే సానుకూల పరిస్థితి ఉంది అంటున్నారు విశ్లేషకులు .

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు