నిన్న అభ్యర్థి ... ఇవాళ నిందితుడు

మాజీ ఎంపీ సిరిసిల్ల నిన్నటి వరకు వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థి.కానీ ఇవాళ నిందితుడిగా పోలీసు కష్టదీలో ఉన్నారు.

 Police Arrest Rajaiah And Family Members-TeluguStop.com

ఒక్క రోజులోనే ఆయన చరిత్ర తిరగబడింది.కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు అగ్ని ప్రమాదంలో చనిపోయిన దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు రాజయ్యను, ఆయన భార్యను, కుమారుడు అనిల్ ను అరెస్టు చేశారు.

శవాలను పోస్టుమార్టం కోసం వరంగల్లోని ఎం జి ఎం ఆసుపత్రికి తరలించారు.రాజయ్యను, కుటుంబ సభ్యులను సుబెదారీ పోలీసు స్టేషన్కు తీసుకుపోయారు.

పోలీసులు నిందితులను ఇంటరాగేషన్ చేయడం ప్రాంభించారు.విచారణ వేగంగా చేస్తారని భావిస్తున్నారు.

రాజయ్య ఎన్నికల గోదాలోకి దిగిన సమయంలోనే ఈ దారుణ ఘటన జరగడంతో ఆయన రాజకేయ జీవితానికి తెర పడింది.నిందితుల మీద చార్జి షీట్లు దాఖలు చేశాక కేసు విచారణ ఎంత కాలం పడుతుందో చెప్పలేము.

అందుకే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించి ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube