మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్తేజ్ రెండవ సినిమా ‘కంచె’ చిత్రీకరణ ఇటీవలే పూర్తి అయ్యింది.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్తేజ్ కొత్తగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ సినిమా స్వాతంత్య్రంకు ముందు పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కినట్లుగా చెబుతున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్లో భారీ ఆసక్తి ఉంది.
ఇటీవల విడుదలైన ‘కంచె’ మూవీ స్టిల్స్ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పకనే చెబుతోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తాం అంటూ మొదట చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
అయితే దసరాకు పెద్ద హీరో క్యూ ఎక్కువగా ఉండటంతో పోటీ ఎందుకనుకుని ముందే వచ్చేయాలని నిర్ణయించుకున్నారు.దసరాకు రెండు వారాల ముందుగానే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేయాని నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
ఈ సినిమాలో వరుణ్కు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది.ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న సమయంలో పూరి దర్శకత్వంలో వరుణ్ ‘లోఫర్’ సినిమాను చేస్తున్నాడు.







