రైతు కుటుంబానికి రాహుల్‌ సాయం

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ‘కిసాన్‌ యాత్ర’ (పాదయాత్ర) ప్రారంభమైంది.జిల్లాలోని నిర్మల్‌లో యువరాజు పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు.

 Rahul Hands Over Cheque To Farmer’s Family-TeluguStop.com

ఆయన యాత్ర ఉద్దేశం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడమేకాకుండా వారికి ఆర్థిక సాయం అదించడం కూడా.మొట్టమొదటగా ఆయన రాజేశ్వర్‌ అనే రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం (చెక్కు ఇచ్చారు) అందచేశారు.

ఇంకొన్ని కుటుంబాలకూ చేస్తారేమో.ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంతవరకు పరామర్శిచలేదని, ఎటువంటి సాయం చేయలేదని విమర్శిస్తున్న కాంగ్రెసు నాయకులు తమ నాయకుడి చేత ఆ పని చేయించారు.

రాహుల్‌ యాత్ర పైకి రైతు కుటుంబాలను పరామర్శించే యాత్రేగాని అసలు ఉద్దేశం కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయడం.అది మరింత బలహీనపడకుండా చూసుకోవడం.

గ్రామీణ ప్రాంతాల్లో, రైతుల్లో ఇమేజీ పెంచుకోవడం.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు విజయానికి బాటలు వేసుకునేందుకు ఈ యాత్ర ఓ పునాదిలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

తెలంగాణలో రాహుల్‌ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube