గతంలో ఎప్పుడు జరుగనంత ప్రతిష్టాత్మకంగా ఈసారి మా ఎన్నికలు జరిగాయి.గత నెల రోజులుగా మా ఎన్నికల హడావుడి ఫిల్మ్ నగర్తో పాటు, మీడియాలో అంతా ఇంతా కాదు.
గత రెండు సార్లుగా ఏకగ్రీవం అవుతూ వచ్చిన మా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి రాజేంద్ర ప్రసాద్ మరియు జయసుధలు పోటీ పడ్డారు.ఇద్దరు పోటీ పడటంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
నేడు మా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో సినీ ప్రముఖులు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మరి కొందరు ప్రముఖులు ఓటింగ్కు దూరం అయ్యారు.
మొత్తం 702 మంది నటీనటులు ఓటు హక్కును కలిగి ఉండగా కేవలం 394 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రముఖ నటుడు బాలకృష్ణతో పాటు మురళి మోహన్, నాగబాబు, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి, కృష్ణ రాజు, బ్రహ్మానందం, గిరిబాబు, రవిబాబులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హోరా హోరీ పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయాలో తెలియక పలువురు ఓటింగ్కు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.