బిహార్లోని జమూయి( Jamui in Bihar ) అనే పట్టణంలో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ ఇల్లాలు తన భర్తను కాదని, బ్యాంకు ఉద్యోగితో లేచిపోయింది.
అంతేకాదు, అతన్నే పెళ్లి కూడా చేసుకుంది.ఈ షాకింగ్ ఘటన బిహార్లోని జమూయిలో జరిగింది.
త్రిపురారి ఘాట్ దగ్గర ఉన్న భూత్నాథ్ టెంపుల్లో ఈ పెళ్లి తంతు జరిగింది.ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందిరా కుమారి( Indira Kumari ) అనే మహిళ సొనో పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మ టాండ్ గ్రామానికి చెందినది.ఆమెకు పెళ్లయి ఏడాదిన్నర అయింది.
కానీ ఆమె తన భర్త చేతిలో చాలా హింసను అనుభవించిందట.రోజూ మద్యం తాగి వచ్చి ఆమెను వేధించేవాడని సమాచారం.
ఈ వేధింపులు భరించలేక విసిగిపోయిన ఇందిరాకు, పవన్ కుమార్ అనే బ్యాంకు ఉద్యోగి పరిచయం అయ్యాడు.పవన్ లచువాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జజాల్ గ్రామానికి( Jajal village ) చెందినవాడు.
పవన్ చకైలోని ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు.లోన్ రికవరీ కోసం అతను ఊరూరా తిరుగుతూ ఉండేవాడు.అలా కొన్ని నెలల కిందట ఇందిరాను కలిశాడు.ఆమె నుంచి లోన్ రికవరీ చేయడానికి తరచుగా వస్తుండేవాడు అయితే ఆ క్రమంలో వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.అలా వారి మధ్య బంధం బలపడింది.
దీంతో ఇందిరా తన భర్తను వదిలి పవన్తో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూత్నాథ్ టెంపుల్లో ( Bhutnath Temple )హిందూ సంప్రదాయ పద్ధతిలో ఇందిరా, పవన్ పెళ్లి చేసుకున్నారు.వారి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ జంట ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించి తెలుసుకుని చాలా మంది స్థానికులు గుమిగూడారు.
ఈ ఘటన ఇప్పుడు ఊర్లో హాట్ టాపిక్గా మారింది.కొందరు ఇందిరా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
భర్త వేధింపులు భరించలేకే ఆమె ఇలా చేసిందని అంటున్నారు.మరికొందరు మాత్రం ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.
మొత్తానికి ఈ ప్రేమ పెళ్లి మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.