నల్లగొండ జిల్లా: తిరుమలగిరి (సాగర్) మండలంలోని రంగుండ్ల గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు.ఆంగోతు తానోజి,రమావత్ చంటి, రమావత్ సైదాలను ఆరెస్ట్ చేయగా మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు.పట్టుబడిన వ్యక్తుల నుంచి రూ.3240 నగదు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.







