యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లా కేంద్రంలో గోల్డ్ డ్రాప్ బ్రాండెడ్ నూనెను పోలిన కల్తీ వంట నూనె విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతుందని,భువనగిరి చుట్టుపక్కల గిరిజన తండాలు,గూడాలు, పల్లెటూరులు ఉండడంతో బ్రాండెడ్ నూనె కొనే ఆర్థిక స్తోమత లేనివారికి కల్తీ నూనె కట్టబెడుతూ ఉన్నారని, నికెపేద,మధ్య తరగతి ప్రజలే టార్గెట్ గా చేసుకుని ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంత జరుగుతున్నా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కల్తీ వంట నూనె విక్రయాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







