రిషబ్ శెట్టి( Rishabh Shetty ).ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కాంతార.
ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రిషబ్ శెట్టి.
అంతేకాకుండా ఈ సినిమాలో నటనకు గాను ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.కాగా కన్నడలో మంచి పేరు తెచ్చుకుని, తెలుగు ప్రేక్షకులకు ఓటిటి ద్వారా పరిచయమైన రిషబ్ శెట్టి ఇప్పుడు తెలుగు లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసేశారు.
ఒకటి మైత్రి సంస్థ ప్రశాంత్ వర్మ( Prashanth Verma ) కాంబినేషన్లో జై హనుమాన్ సినిమా, ఇందులో రిషబ్ హనుమాన్ ( Hanuman )పాత్రలో కనిపించనున్నారు.ఇక రెండో సినిమా సితార సంస్థతో.ఈ సినిమాను కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తారు.
రిషబ్ స్వయంగా కథను, దర్శకుడిని ఎంచుకుని సితార సంస్థకు పంపించాడట.ఈ సినిమా జై హనుమాన్(Jai Hanuman ) కంటే ముందుగా ప్రారంభం అవుతుందట.
కాగా పారితోషికాలు, మార్కెట్ వీటిని దృష్టిలో ఉంచుకుంటే, కన్నడ మలయాళ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమాలు చాలా ముందున్నాయని చెప్పవచ్చు.
అందుకే అన్ని భాషల హీరోలు తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు.మరి రాబోయే సినిమాలతో రిషబ్ శెట్టి ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటారో చూడాలి మరి.అయితే కన్నడతో పాటు ఇప్పుడు తెలుగులో కూడా ఫుల్ బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు హీరో రిషబ్ శెట్టి.మరి తెలుగులో ఎలాంటి సక్సెస్ను అందుకుంటారు చూడాలి మరి.