పాఠశాలను పాకసాలగా మార్చిన ప్రబుద్ధులు

నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను కొందరు ప్రబుద్ధులు పాకసాలగా మార్చుకొని నిత్యం మద్యం సేవిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం…సోమవారం కృష్ణాష్టమి రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సిట్టింగ్ వేసి మద్యం సేవించగా, ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు,విద్యార్థులకు బీరు సీసాలు దర్శనమివ్వడంతో ఖంగుతున్నారు.

 School Turned As Meeting Point For Drunkers-TeluguStop.com

ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ ఇది ఒక్కసారి కాదని,ప్రతీ రోజూ ఇలాగే మద్యం తాగి పిల్లలు చదువే ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ మద్యం బాటిళ్లు ఇక్కడే వదిలేసి వెళుతున్నారని అంటున్నారు.

ప్రభుత్వం మనఊరు మనబడి కార్యక్రమం చేస్తుంటే కొందరు మన ఊరు మన మద్యం కార్యక్రమం చేస్తూ పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు.

అందరికీ జ్ఞానాన్ని పంచిన విద్యాలయమన్న విషయాన్ని మర్చిపోయి పాఠశాల వరండాను తాగుబోతులకు అడ్డాగా మార్చుకున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలో ఇదేం పనని ఎవరైనా వారిని ప్రశ్నిస్తే తాగిన మైకంలో వారిపై దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహించి, మందుబాబుల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube