ఆరుగురు గొలుసు దొంగలు అరెస్ట్ చేసిన పోలీసులు

సూర్యాపేట జిల్లా:ఒంటరిగా నిద్రిస్తున్న మహిళా ఒంటిపై నుండి ఆభరణాలు దొంగిలిస్తున్న,నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న స్త్రీ,పురుషుల జంటలను బెదిరించి రాబరీలకు పాల్పడుతున్న, తాళం వేసి ఉన్న ఇంటిలో దంగతనాలు చేస్తున్న ఆరుగురు దొంగలను సూర్యాపేట జిల్లా ( Suryapet District)మునగాల, హుజూర్ నగర్,చివ్వెంల పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్(District SP Sunpreet Singh) శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను మునగాల,హుజూర్ నగర్, చివ్వెంల పోలీసులు అరెస్ట్ చేసి,వారి నుండి 30 లక్షల విలువగల 35.4 తులాల బంగారు,10 తులాల సిల్వర్ ఆభరణాలను,6 మొబైల్స్,3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని 6 గురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.అయితే చివ్వెంల పీఎస్ కేసులో ఒకరు పరారీలో ఉన్నారని,అతనిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.

 Police Arrested Man For Chain Theft In Suryapet District, Suryapet District , Ch-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube