టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో గోపీచంద్ ఒకరు కాగా కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈ హీరో గత పదేళ్లలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలతో నిరాశపరిచారు.గోపీచంద్ గత సినిమా రామబాణం( Ramabanam ) భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చి నిర్మాతలను ముంచేసింది.
అయితే గోపీచంద్ కొత్త సినిమా త్రినాథరావు నక్కిన( Trinadha Rao Nakkina )డైరెక్షన్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది.
ధమాకా( Dhamaka )తో హిట్ కొట్టిన ఈ దర్శకుడు ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా తర్వాత గోపీచంద్ నక్కిన త్రినాథరావు కాంబోలో సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.ఈ సినిమాతో గోపీచంద్ వరుస ఫ్లాపులకు బ్రేక్ పడినట్టేనా అనే చర్చ జరుగుతుండటం గమనార్హం.
భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
సందీప్ కిషన్ నక్కిన కాంబో సినిమాకు మజాకా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.నక్కిన త్రినాథరావు గోపీచంద్ తో సినిమా కోసం సరైన కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.మజాకా సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో నటిస్తుండటం కొసమెరుపు.
గోపీచంద్ ప్రస్తుతం విశ్వం( Viswam ) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.గోపీచంద్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది.గోపీచంద్ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గోపీచంద్ సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
గోపీచంద్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి కెరీర్ పరంగా మరింత ఎదిగితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు అయితే ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గోపీచంద్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.