రాజన్న ఆలయ అనుబంద దేవాలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వారి కళ్యాణోత్సవము

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న అనుబంద దేవాలయమైన శ్రీవేణుగోపాలస్వామి ఆలయమునందు లోక కళ్యాణార్థం తేది: 23-06-2024 ఆదివారం నుండి తేది: 27-06-2024 గురువారంవరకు లోకళ్యాణార్ధం అధ్యయనోత్సవాలు, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవము – భక్తోత్సవము సందర్భంగా ఈరోజు ఉదయము6.30 ని.ల నుండి శ్రీస్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకము,అర్చన సాయంత్రం గం.4.05 ని.ల నుండి తొళ్ళెర్కము, ద్రావిడవేదపారాయణము నీరాజనము మంత్రపుష్పము శ్రీరుక్మిణీసత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామి వారి కళ్యాణోత్సవము ఆలయ అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు,

 Sri Rukmini Sathyabhama Kalyanotsava Was Celebrated At Sri Venugopala Swamy Temp-TeluguStop.com

కన్యాదాతలుగా బురుగడ్డ అనూష కిషన్ లు వ్యవహరించారు భక్తోత్సవము జరుగును తదుపరి పూర్ణాహుతి – సదస్యం తీర్థప్రసాద వితరణ చేసిన అనంతరం రాత్రిగం.8.30ని.అనుండి ఏకాంత సేవతో ఉత్సవ సమాప్తి జరుగును,తీర్థ ప్రసాద వితరణ జరుగును.ఈకార్యక్రమంలో ఏ ఈ ఓ హరికిషన్ ,పర్యవేక్షకులు గుండి హరిహారనాథ్ నక్క తిరుపతి రవీందర్ రెడ్డి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube