రాజన్న ఆలయ అనుబంద దేవాలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వారి కళ్యాణోత్సవము

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న అనుబంద దేవాలయమైన శ్రీవేణుగోపాలస్వామి ఆలయమునందు లోక కళ్యాణార్థం తేది: 23-06-2024 ఆదివారం నుండి తేది: 27-06-2024 గురువారంవరకు లోకళ్యాణార్ధం అధ్యయనోత్సవాలు, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవము - భక్తోత్సవము సందర్భంగా ఈరోజు ఉదయము6.

30 ని.ల నుండి శ్రీస్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకము,అర్చన సాయంత్రం గం.

4.05 ని.

ల నుండి తొళ్ళెర్కము, ద్రావిడవేదపారాయణము నీరాజనము మంత్రపుష్పము శ్రీరుక్మిణీసత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామి వారి కళ్యాణోత్సవము ఆలయ అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు, కన్యాదాతలుగా బురుగడ్డ అనూష కిషన్ లు వ్యవహరించారు భక్తోత్సవము జరుగును తదుపరి పూర్ణాహుతి - సదస్యం తీర్థప్రసాద వితరణ చేసిన అనంతరం రాత్రిగం.

8.30ని.

అనుండి ఏకాంత సేవతో ఉత్సవ సమాప్తి జరుగును,తీర్థ ప్రసాద వితరణ జరుగును.ఈకార్యక్రమంలో ఏ ఈ ఓ హరికిషన్ ,పర్యవేక్షకులు గుండి హరిహారనాథ్ నక్క తిరుపతి రవీందర్ రెడ్డి ఉన్నారు.

బాబు గారి నిర్ణయం :  ఏపీలో ఇసుక ఫ్రీ ఫ్రీ