సాధారణంగా భారత దేశంలో చాలామంది సుదూరాలకు వెళ్ళలిసిన ప్రయాణాలు చేయాలంటే ముందుగా ఎంచుకునేది రైలు ప్రయాణం.దీనికి కారణం రైలు లో ప్రస్థానంగా పడుకొని వెళ్ళవచ్చని.
ఇక కొన్ని సందర్భాలలో ట్రైన్ లో సీటు దొరకక మనం నించొని లేదా డోర్ దగ్గర కూర్చొని ప్రయాణించడం చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా సోషల్ మీడియా( Social media ) లో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ట్రైన్లో స్థలం లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు ట్రైన్ పైన ఎక్కి నిద్రిస్తూ ప్రయాణించడం మనం చూడవచ్చు.

ఇక ఇప్పటికే చాలామంది సెల్ఫీలు, రీల్స్ అంటూ పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తున్న వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూ ఉండడం మనం గమనించాము.ఎంతైనా కానీ రైల్లో స్థలం లేదని మరి ఏకంగా రైలు పైకి ఎక్కి ప్రయాణం చేయడం ప్రమాదకరం అని వాళ్లు గ్రహించలేదా అంటూ కొంతమంది ప్రయాణికులు మండిపడుతున్నారు.ఇంకా వారు రైలు పైన ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు ఎంతో వేగంగా వెళ్తుంది.ఒకవేళ ఏదైనా అకస్మాత్తుగా జరగరానిది జరుగుతే అందరికి ఇబ్బంది కదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా రైలు పై ప్రయాణించే క్రమంలో ఓ వింతైన సంఘటన చేటుచేసుకుంది.ఓ జంట ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని పడుకొని మరి ప్రయాణించన వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.







