టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో తరచూ ఏదోక విషయంతో సమంత పేరుతో మీడియాలో వినిపిస్తూనే ఉంది.
కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా, అందం, ఫోటోస్ విషయాలలో వార్తల్లో నిలుస్తోంది.కాగా మొదట ఏం మాయ చేసావే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది సమంత.ఇక ఆమె వైవాహిక జీవితం గురించి మనందరికి తెలిసిందే.అక్కినేని హీరో నాగ చైతన్య నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది.ఆ సంగతి పక్కన పెడితే.అల్లు అర్జున్ రష్మిక మందన కలిసి నటించిన పుష్ప ( Pushpa )పార్ట్ వన్ సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే.ఆ పాట విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది.
ఊ అంటావా ఊఊ అంటావా మావా అనే పాట అటు యూట్యూబ్ ని కూడా సంచలనం సృష్టించింది.

ఆ పాటకు డాన్స్ చేయడానికి సమంతకు రూ.5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది.అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబసభ్యులు,స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.ఆ సమయంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను.
అలాంటి సమయంలో పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్లో నటించవద్దని కుటుంబసభ్యులు, సన్నిహితులు చెప్పారు.కానీ వారి మాట నిలబడకుండా నేను ఆ పాటలో నటించాను అని తెలిపింది సామ్.







