నిజానికి ఏ వంటకం కూడా ఉప్పు కారం లేనిది రుచిగా అనిపించిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఆహారానికి తగ్గట్టుగా వాటిని వాడుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
కానీ., ఒకవేళ వాటిని ఎక్కువగా వినియోగించిన మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.
ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు ఓ ఎలక్ట్రికల్ స్పూన్( Electric spoon ) ను రూపొందించారు.ఇందులో ఆహారాన్ని దానంతట అదే కాస్త ఉప్పగా మార్చేస్తుంది.
ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
జపాన్( Japan) దేశంలో ఓ ప్రత్యేకమైన చెంచాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.బ్యాటరీతో పనిచేసే విధంగా తయారు చేసిన ఈ ఎలక్ట్రికల్ స్పూన్ ఆహారాన్ని ఉప్పుగా రుచి చేస్తుంది.మెటల్, ప్లాస్టిక్ పదార్థాలకు తయారుచేసిన ఈ స్పూన్ ఉప్పు తీసుకోవడం తగ్గించుకోవడానికి కష్టపడుతున్న వారి కోసం ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
ఈ ఎలక్ట్రికల్ స్పూన్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
జపాన్లోని బిజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హోమి కొంతమంది పరిశోధకులతో కలిసి ఈ స్పూను అభివృద్ధి చేశారు.కొన్ని నివేదికల ప్రకారం.ఈ ఎలక్ట్రికల్ సాల్ట్ స్పూన్ టెక్నిక్ 2023లో నోబుల్ అవార్డును( Nobel Prize ) కూడా గెలుచుకుంది.
ఎక్కువగా సోడియం( Sodium ) తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లాంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్న నేపథ్యంలో ఇలాంటి స్పూన్ ఎలాంటి ఉప్పును ఆహారంలో వేయకపోయినా దానికి తగ్గట్టుగా ఉప్పును సరిచేసి మన నోటి కందిస్తుంది.ఇకపోతే ఈ ఎలక్ట్రికల్స్ స్పూన్ మార్కెట్లలో లభ్యం అవుతుంది.
మే 22 మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ ఎలక్ట్రికల్ స్పూన్ భారతీయ కరెన్సీలో 10469 రూపాయలు.