ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే క్షుద్రపూజలు.. డీకే శివకుమార్ హాట్ కామెంట్స్

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్( Karnataka Deputy CM DK Shivakumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సిద్ధరామయ్య( Siddaramaiah )తో పాటు తనకు వ్యతిరేకంగా కొందరు యాగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

 Occult Worship To Destabilize The Government.. Dk Sivakumar Hot Comments ,karnat-TeluguStop.com

తమ ప్రభుత్వంతో పాటు తమకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు ‘ శత్రు భైరవి’ పేరిట యాగం చేస్తున్నారని డీకే ఆరోపించారు.ఈ మేరకు కేరళలోని ఏకాంత ప్రదేశంలో అఘోరీలు, తాంత్రికులు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఇందులో భాగంగా 21 మేకలు, 3 గేదెలు, 21 నల్ల గొర్రెలు మరియు ఐదు పందులను బలి ఇస్తున్నారన్నారు.కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే కిందరు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.

అదేవిధంగా కర్ణాటకలో నిమ్మకాయల నిపుణులెవరో అందరికీ తెలుసన్నారు.అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తనను దేవుడే రక్షిస్తారని తెలిపారు.

కాగా ప్రస్తుతం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube