సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు కేసులో ఏసీబీ దర్యాప్తు..!!

హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ( CCS ACP Umamaheswara Rao )కేసులో ఏసీబీ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.ఈ మేరకు ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ కస్టడీకి కోరింది.

 Acb Investigation In Ccs Acp Umamaheswara Rao Case , Ccs Acp Umamaheswara Rao C-TeluguStop.com

కాగా ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు( ACB officials ) ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయనను వారం రోజుల పాటు కస్టడీ విచారణకు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఏసీబీ అధికారులు కోరారు.

ఉమామహేశ్వర రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరి కొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా ఏసీపీ ఉమామహేశ్వర రావు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవలే జూన్ 5వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube