సినీ నిర్మాత బండ్ల గణేశ్ పై కేసు నమోదు

సినీ నిర్మాత బండ్ల గణేశ్( Bandla Ganesh ) పై కేసు నమోదైంది.ఫిలింనగర్ లో హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్ ( Nowheera Shaikh )తన ఇల్లును కబ్జా చేశారని ఆయనపై అభియోగాలు మోపారు.

 A Case Has Been Registered Against Film Producer Bandla Ganesh , Bandla Ganesh,-TeluguStop.com

ఇల్లు ఖాళీ చేయమన్నందుకు తనను నిర్భందించి బండ్ల గణేశ్ బెదిరింపులకు పాల్పడ్డారని నౌహీరా షేక్ ఆరోపించారు.ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీకి నౌహీరా షేక్ ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు బండ్ల గణేశ్ పై ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే రూ.75 కోట్ల విలువైన ఇల్లును బండ్ల గణేశ్ కబ్జా చేశారని ఆమె గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.బండ్ల గణేశ్ కు నెలకు రూ.లక్ష చొప్పున అద్దెకు ఇచ్చానన్న ఆమె తనకు కొంతకాలంగా కిరాయి ఇవ్వడం లేదని ఆరోపించారు.అంతేకాకుండా గూండాలతో బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో నౌహీరా తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేశారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube