కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న రాయ్ బరేలి, అమేథి(Rai Bareli, Amethi) స్థానాల్లో పోటీపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది.ఈ మేరకు రెండు స్థానాలకు ఏఐసీసీ(AICC) అభ్యర్థులను ప్రకటించింది.
రాయ్ బరేలి స్థానం నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పోటీ చేయనున్నారు.అయితే ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఈసారి పోటీకి దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అమేథి నియోజకవర్గ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మను ఏఐసీసీ(Kishori Lal Sharma AICC) ప్రకటించింది.అలాగే రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కాగా ఇప్పటికే కేరళలోని వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు.అయితే అమేథి నుంచి రాహుల్ గాంధీ, రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
కానీ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ప్రియాంక గాంధీ దూరంగా ఉంటున్నారని స్పష్టం అయింది.