తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి( Alleti Maheshwar Reddy ) మరోసారి విమర్శలు గుప్పించారు.ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టిందని పేర్కొన్నారు.
ఇప్పుడు కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఏలేటి మండిపడ్డారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు,( Harish Rao ) సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) డ్రామాలో చీకటి ఒప్పందం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆగస్ట్ 15 లోపు అన్ని హామీలను అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న ఏలేటి రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు.