ఏపీలో ఎన్నికల కమిషన్( AP Election Commission ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను( Anganwadis,Contract Employees ) ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల సిబ్బంది కొరత( Election Staff ) నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12డి ( Form 12D )జారీ గడువును వచ్చే నెల 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.గతంలో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు.
ఇప్పటివరకు అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు.ఈ క్రమంలోనే ఆరోపణలు ఉన్న సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని జిల్లా అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.