టీడీపీ ఎన్ఆర్ఐలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు( Chandrababu ) కూటమికి ఘోర పరాజయం తప్పదని ఆయన అను‘కుల’ ఎన్ఆర్ఐ బృందానికి అర్థమైందని విమర్శించారు.
అందుకే డబ్బు మదంతో వాళ్ల కళ్లకు పొరలు కమ్మాయని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కోమటి జయరామ్ చౌదరి( Komati Jayaram Chowdary ) అనే ప్రవాసుడు వైసీపీ సానుభూతిపరులపై నోరు పారేసుకున్నారని మండిపడ్డారు.
ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు పారేసి వారిని టీడీపీ వైపు( TDP ) లాగాలని తన వర్గానికి పిలుపునిచ్చారని ఆరోపించారు.దీన్ని బట్టి ఎంత డబ్బు సిద్ధం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
కరెన్సీ కట్టలకు ఓట్లు రాలవు బాబు అన్న విజయసాయి రెడ్డి 1980- 90 కాలం నాటి మైండ్ సెట్ నుంచి బయటపడాలని సూచించారు.