ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal) అరెస్ట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్ చేసింది.లిక్కర్ పాలసీ( Liquor Policy ) కేసులో కేజ్రీవాల్ కు తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఈడీ విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నారని ఈడీ అఫిడవిట్ లో పేర్కొంది.
ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అఫిడవిట్ లో తెలిపింది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.