ప్రభుత్వ పాఠశాలలో( Government School ) చదివి మంచి మార్కులు సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.అయితే త్రివేణి( Triveni ) అనే విద్యార్థికి తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలలో 593 మార్కులు సాధించారు.
త్రివేణి తండ్రి ఆటో డ్రైవర్ గా పని చేస్తుండగా తల్లి కూలి పని చేస్తున్నారు.తనకు మంచి మార్కులు రావడంతో త్రివేణి ఎంతో సంతోషిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలలో ప్రస్తుతం వసతులు బాగున్నాయని త్రివేణి చెబుతున్నారు.
ఉన్నత చదువులు చదివి సివిల్స్ రాయాలనేది తన లక్ష్యమని త్రివేణి చెబుతున్నారు.దేవరకొండ మండలం( Devarakonda Mandal ) తెర్నేకల్ గ్రామానికి చెందిన త్రివేణి మంచి మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.570 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం.ఎమ్మిగనూరు మండలంలోని అరేకల్ మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ లో త్రివేణి చదివారని సమాచారం.

పదో తరగతి పరీక్ష ఫలితాలలో( Tenth Class Results ) కర్నూలు అట్టడుగు స్థానంలో నిలవగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం వల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామూయేల్ చెప్పుకొచ్చారు.ఇది క్వాలిటీ రిజల్ట్ అని గతేడాదితో పోల్చి చూస్తే మాత్రం ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఆయన కామెంట్లు చేశారు.పదో తరగతి ఫలితాలు అనుకూలంగా రావడంతో చాలామంది విద్యార్థినులు ఎంతో సంతోషిస్తున్నారు.

పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు లక్ష్యానికి అనుగుణంగా ఇంటర్ లో మంచి గ్రూప్ ను ఎంచుకుని కష్టపడితే ఆశించిన ఫలితాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కెరీర్ పరంగా తీవ్రస్థాయిలో నష్టపోయే ఛాన్స్ ఉంటుంది.మారుతున్న కాలానికి అనుగుణంగా కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది.







