తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే అని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్( Rajnath Singh ) అన్నారు.బీఆర్ఎస్ పార్టీ ప్రజల సొమ్ము దోచుకుందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్( Congress ) పేదరికాన్ని పెంచి పోషించిందని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు.అయితే తాము పేదరికం నుంచి 15 కోట్ల మందిని బయటకు తీసుకొచ్చామన్నారు.
మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ( Telangana ) అభివృద్ధి పథంలో కొనసాగాలంటే అది కేవలం బీజేపీతో సాధ్యమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అయితే కిషన్ రెడ్డి( Kishan Reddy ) నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలను చేశారు.