దమ్ముంటే నాపై పోటీ చేయాలి.. పవన్, చంద్రబాబుకు మంత్రి జోగి రమేశ్ ఛాలెంజ్..!

విపక్ష నేతలు చంద్రబాబు,( Chandra Babu ) పవన్ కల్యాణ్ పై( Pawan Kalyan ) మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ కల్యాణ్, చంద్రబాబు సంస్కార హీనులన్న ఆయన సీఎం జగన్ పై దాడిని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.

 Compete Against Me Minister Jogi Ramesh Challenges Pawan And Chandrababu Details-TeluguStop.com

సీఎం జగన్ నిర్వహించే ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని మంత్రి జోగి రమేశ్( Minister Jogi Ramesh ) ఆరోపించారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభలకు ప్రజలు రావడం లేదని విమర్శించారు.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబును చంద్రగిరిలో ఓడిస్తే కుప్పం పారిపోయారన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కానీ, పవన్ కల్యాణ్ కు కానీ దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.ఎన్నికల ఫలితాల తరువాత ఇద్దరూ హైదరాబాద్ పారిపోతారన్న మంత్రి జోగి రమేశ్ జూన్ 4 తరువాత టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.

అనంతరం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్ తనపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.పవన్ కు దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube