ప్రపంచంలో ఎక్కడైనా సరే పురాతన ఇల్లు భవనాలు నిర్మాణం జరుగుతున్న సమయంలో, కొన్ని చోట్ల నిధి నిక్షేపాలు బయటపడుతుండడం మనం వింటూనే ఉంటాం.ఇకపోతే బయటపడినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ సమానంగా పంచుకొని దానిని బయటకు చెప్పకుండా చాలామంది విషయాలని అలాగే దాచేస్తుంటారు.
ఒకవేళ నిధినిక్షేపాలు బయటపడ్డ విషయం బయటకు వస్తే కనుక అది పోలీసుల వరకు వెళితే నిధి దొరికిన సమయంలో ఆ నిధికి సంబంధించిన 1/5 వంతు సొమ్మును దొరికిన కుటుంబం వారికి ప్రభుత్వం అందజేస్తుంది.ఒకవేళ ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై కఠినమైన శిక్షలు తీసుకునేందుకు కూడా చట్టాలు ఉన్నాయి.
ఇలా నిధినిక్షపాలు బయటపడినప్పుడు రాచరిక కాలానికి చెందిన వస్తువుల అయితే మాత్రం వాటిని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ( Archaeological Survey of India )స్వాధీనం చేసుకుంటుంది.ఒకవేళ అందులో ఏవైనా బంగారు వస్తువులు అలాంటివి కనుక ఉంటే వారి పూర్వీకులవి సంబంధించినది అయితే వారి కుటుంబానికి 1/5 వంతు వారికి సమానంగా పంచుతారు.ఇకపోతే తాజాగా ఓ నిధినిక్షేపనికి సంబంధించిన తవ్వకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ జెసిబి తో తవ్వకాలు జరుగుతుండగా నిధిని బయటపడిన వీడియో లో కాంక్రీట్ స్లాబ్ ను( Concrete slab ) బయటకు తీస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ జరిగింది.జెసిబి ఆపరేటర్ భూమిని తవ్వుతున్న సమయంలో ఒక స్లాబ్ తీయడానికి కష్టపడుతున్నట్లు కనపడుతుంది.అలా తవ్వుతున్న సమయంలో స్లాబ్ ను కొంత వరకు బయటకు తీసిన తర్వాత భూమిలో ఓ బంగారు వస్తువు లాంటిది కనపడుతుంది.
ఆ బంగారు వస్తూ ఉన్న వైపు బాణం గుర్తును కూడా చూపించడం వీడియోలో గమనించవచ్చు.అయితే అది బంగారు వస్తువ.లేకపోతే ఇంకా ఏమైనా అనేది మాత్రం స్పష్టంగా తెలియ రాలేదు.ఈ వీడియోకు సంబంధించి మాత్రం జెసిబి తో నిదిని వెలికితీస్తున్నట్లు క్యాప్షన్ లో తెలిపారు.
ఇకపోతే ఈ వీడియో ఏ దేశానికి చెందినది మాత్రం అర్థం కావట్లేదు
.