బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC Kavitha ) సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) హజరుపరిచారు.ఈ నేపథ్యంలో కవితను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది.
సీబీఐ అధికారుల అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కవితను తొమ్మిది రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.దీంతో ఈ నెల 23 వ తేదీ వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
ఈ క్రమంలో ఆమెను సీబీఐ అధికారులు ( CBI officers )తీహార్ జైలుకు తరలించనున్నారు.మరోవైపు కవిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది సీబీఐ కస్టడీ కాదని.బీజేపీ కస్టడీ అని ఆరోపించారు.
బయట బీజేపీ వాళ్లు మాట్లాడేది లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని తెలిపారు.