ఎన్టీఆర్, త్రివిక్రమ్( NTR, Trivikram ) ఒకే వేదిక మీదకు వచ్చి చాలా రోజులు అయ్యింది.ఇలాంటి అవకాశం మరోసారి వచ్చేలా కనిపిస్తోంది.
అయితే అరవింద సమేత సమయంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఒక వేదిక మీద భావావేశంతో మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి. అల వైకుంఠపురములో ( Ala Vaikunthapuram )తరువాత ఆ ఇద్దరు కలిసి సినిమా చేయాల్సి వుంది.
కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.మంచి భారీ యాక్షన్ సినిమా అది అని అప్పట్లో టాక్ వినిపించింది.
ఆ తరువాత త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ తో వేరే ప్రాజెక్ట్ మీదకు వెళ్లి, అది రకరకాలుగా మారి, గుంటూరు కారంగా బయటకు వచ్చింది.అది వేరే సంగతి అనే చెప్పాలి.ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్.త్రివిక్రమ్ సరైన హీరో డేట్ ల కోసం చూస్తున్నారు.బన్నీ తో సినిమా అన్నది ఉండనే ఉంది.మరి ఆ తరువాత ఎన్టీఆర్ తో వుంటుందా? తెలియాలి.ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ చాలా అంటే చాలా భారీ పాన్ ఇండియా కథ ( pan India story )రెడీ చేస్తున్నారని గతంలో ఇచ్చిన ఇంటర్వూల్లో నిర్మాత నాగవంశీ ( Produced by Nagavanshi )తెలిపారు.ఇప్పుడు అదే నాగవంశీ నిర్మించిన టిల్లు స్క్యేర్ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ హాజరవుతున్నారు.
ఎన్టీఆర్ హారిక సంస్థ నడుమ మంచి సంబంధాలు ఉన్నాయని ఈ పాయింట్ ప్రూవ్ చేస్తోంది.ఇక మిగిలింది త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పటికైనా టిల్లు స్క్యేర్ సినిమాలో త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా భాగస్వామి.అందువల్ల ఈ సక్సెస్ మీట్ కు త్రివిక్రమ్ హాజరు కావాల్సి ఉంటుంది.మామూలు సక్సెస్ మీట్ అయితే స్కిప్ చేయవచ్చు.కానీ ఎన్టీఆర్ వస్తున్నారు కనుక స్కిప్ అన్నది వుండకపోవచ్చు.ఒకవేళ అదే కనుక జరిగితే ఒకే వేదిక మీద ఎన్టీఆర్ త్రివిక్రమ్ ని చూడవచ్చు.