కేసీఆర్ పై కాంగ్రెస్ మంత్రుల ముప్పేటదాడి..: హరీశ్ రావు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు( Harish Ra ) కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ సీఎం కేసీఆర్ పొలంబాటలో రైతుల గురించి తప్ప రాజకీయాల గురించి మాట్లాడలేదని చెప్పారు.

 Attack Of Congress Ministers On Kcr..: Harish Rao, Harish Rao, Brs , Ts Politic-TeluguStop.com

ఈ క్రమంలో కేసీఆర్ పై మంత్రులు ముప్పేటదాడి ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతాభావం పెరిగిందని తెలుస్తోందన్నారు.

కేసీఆర్ పొలంబాట కార్యక్రమం( KCR Polam Bata ) నిర్వహించిన తరువాతే ప్రభుత్వం నీళ్లు వదులుతోందని హరీశ్ రావు తెలిపారు.కేసీఆర్ పర్యటనకు ముందు లేని నీళ్లు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.కరవుతో ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు.తెలంగాణలో ప్రస్తుతమున్నది కాలం తెచ్చిన కరవు కాదన్న హరీశ్ రావు కాంగ్రెస్ తెచ్చిన కరవని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube