తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు( Harish Ra ) కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ సీఎం కేసీఆర్ పొలంబాటలో రైతుల గురించి తప్ప రాజకీయాల గురించి మాట్లాడలేదని చెప్పారు.
ఈ క్రమంలో కేసీఆర్ పై మంత్రులు ముప్పేటదాడి ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతాభావం పెరిగిందని తెలుస్తోందన్నారు.
కేసీఆర్ పొలంబాట కార్యక్రమం( KCR Polam Bata ) నిర్వహించిన తరువాతే ప్రభుత్వం నీళ్లు వదులుతోందని హరీశ్ రావు తెలిపారు.కేసీఆర్ పర్యటనకు ముందు లేని నీళ్లు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.కరవుతో ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు.తెలంగాణలో ప్రస్తుతమున్నది కాలం తెచ్చిన కరవు కాదన్న హరీశ్ రావు కాంగ్రెస్ తెచ్చిన కరవని విమర్శించారు.