లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ మ్యానిఫెస్టో కమిటీని( BJP Manifesto Committee ) నియమించింది.ఈ మేరకు బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా( JP Nadda ) 27 మందితో పార్టీ మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు.
బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడుగా రాజ్ నాథ్ సింగ్ ను( Rajnath Singh ) జేపీ నడ్డా నియమించారు.
కన్వీనర్ గా నిర్మిలా సీతారామన్,( Nirmala Sitaraman ) కో -కన్వీనర్ గా పీయూష్ గోయల్,( Piyush Goyal ) కమిటీ సభ్యులుగా పలువురు కేంద్రమంత్రులు, మాజీ సీఎం, సీనియర్ నేతలు ఉండనున్నారు.కాగా బీజేపీ మ్యానిఫెస్టో కమిటీలో 16 రాష్ట్రాల నేతలకు స్థానం కల్పించారు.అయితే తెలుగు రాష్ట్రాల నుంచి నేతలకు కమిటీలో చోటు దక్కలేదు.