రోడ్లమీద ఇష్ట రాజ్యంగా ప్రయాణించే వారికి కొదవలేదు.వీరి కారణంగా ఎలాంటి తప్పులు చేయకపోయినా రోడ్డు ప్రమాదాల కేసుల్లో చాలా మంది చిక్కుకుపోతుంటారు.
అయితే టెక్నాలజీ కారణంగా కొన్ని సందర్భాల్లో అమాయకులు నిర్దోషులుగా బయటపడుతుంటారు.బెంగళూరు నగరంలో ఇదే జరిగింది.
వివరాల్లోకి వెళ్తే ఇటీవల బెంగళూరు( Bengaluru )లో కారు డ్రైవర్ ఒక రోడ్డు యాక్సిడెంట్ లో బాధితుడయ్యాడు.ముందుగా అతడిదే తప్పు అని వేరే పార్టీ వాళ్లు ఆరోపణలు చేశారు.
అయితే పోలీసులు కారు డాష్బోర్డ్ కెమెరా నుండి వీడియోను తనిఖీ చేసిన తర్వాత అతని తప్పు లేదని తేలింది.ఈ ప్రమాదం మార్చి 17న బెంగళూరు సమీపంలో జరిగింది.
ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్, కారు ఢీకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో బాగా పాపులర్ అయింది.

సురక్షితమైన డ్రైవింగ్ను ప్రోత్సహించే బెంగళూరులోని డ్రైవ్స్మార్ట్ అనే సంస్థ వీడియోను షేర్ చేసింది.డ్యాష్బోర్డ్ కెమెరా నుంచి వీడియో చూసిన పోలీసులు కారు డ్రైవర్కు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు.కారు డ్రైవర్ తెల్లటి హ్యుందాయ్ ఇయాన్ కారును ఆపై మరో కారును ఓవర్టేక్ చేయడం వీడియోలో చూడవచ్చు, అనంతరం ఆ కారు డ్రైవర్ వెళ్తున్న మార్గంలోకి ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ ముగ్గురు మోటార్సైకిల్పై వచ్చారు.వారు ఈ కారుకి అడ్డంగానే రోడ్డుపైకి వచ్చేస్తూ కారు డ్రైవర్ కి టెన్షన్ పుట్టించారు.
వారు రోడ్డును అస్సలు చూడకుండా గుడ్డిగా ట్రై చేస్తున్నారు.కారు మోటార్సైకిల్ను దాటుతుండగా, డ్రైవర్ హారన్ మోగించి వారిని హెచ్చరించాడు, ఇంతలోనే బైకు కారును ఢీకొడుతుంది.

ఈ సంఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా ఎంత తీవ్రంగా గాయపడ్డారు అనేది తెలియ రాలేదు, అయితే ప్రమాదం తప్పిందని డ్రైవ్స్మార్ట్ వీడియోకు క్యాప్షన్ జోడించింది.మోటారు సైకిల్ చూడగానే కారు డ్రైవర్ వేగం తగ్గించి ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు.ప్రమాదానికి బాధ్యులెవరనే దానిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కారు డ్రైవర్ చాలా వేగంగా వెళ్తున్నాడని, వేగం తగ్గించి ఉండాల్సిందని కొందరు అంటున్నారు.మరికొందరు మోటార్సైకిల్పై వెళ్లేవారు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు.పోలీసులు మాత్రం బైక్ నడుపుతున్న వ్యక్తులదే తప్పు అని నిర్ధారించారు.
డాష్బోర్డ్ కెమెరా( Dashboard camera )నే ఈ కారు డ్రైవర్ను కేసుల నుంచి కాపాడిందని చెప్పుకోవచ్చు.








