Pallavi Prashanth : సాయం చేయమని పేద రైతులు ఎవరు మా ఇంటికి రావద్దు.. పల్లవి ప్రశాంత్ షాకింగ్ కామెంట్స్!

రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలోకి వెళ్లి బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వెళ్లినటువంటి ఈయన ఏకంగా విజేతగా రావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీల మారిపోయారు.

ఇక ఈయన హౌస్ లో ఉన్నప్పుడు తాను కనుక విజేతగా నిలిస్తే వచ్చే ప్రైజ్ మనీ( Prize Money ) మొత్తం రైతులకే ఇస్తానని చెప్పిన సంగతి మనకు తెలిసిందే.ఇలా చెప్పి సింపతిని కొట్టేసి విన్నర్ గా నిలిచారు.

ఇక ఈయన ప్రైజ్ మనీ డబ్బులు ఇప్పటి వరకు పంచకపోవడంతో భారీ స్థాయిలోనే ట్రోల్స్ వచ్చాయి.

ఇలా ట్రోల్స్ రావడంతో మొదటి సాయంగా ఒక కుటుంబానికి లక్ష రూపాయల విరామంతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం బస్తాలను అందించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అయితే తన దగ్గర ఇంకా 35 లక్షలు ఉందని వాటిని కూడా త్వరలోనే అందరికీ పంచి వీడియోలు మీ అందరికీ షేర్ చేస్తానని అందులో నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోనని ప్రశాంత్ తెలిపారు.ఇలా ఈయన పేద రైతులకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఒక్కసారిగా రైతులు ఈయన ఇంటికి క్యూ కట్టారు.

చుట్టుపక్కల గ్రామాల వాళ్లందరూ కూడా తాము పేద రైతులమని( Farmers ) తమకు సహాయం చేయాలని కోరుతూ ఈయన ఇంటికి వస్తున్నారు.ఇలా రైతులందరూ ఇంటికి వస్తున్నటువంటి తరుణంలో పల్లవి ప్రశాంత్ రైతులను ఉద్దేశించి దయచేసి నేను పేద రైతుని నాకు సహాయం చేయండి అంటూ ఎవరు మా ఇంటికి రావద్దు అమ్మ నాన్నలను ఇబ్బంది పెట్టద్దు నేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వారికే డబ్బు సహాయం చేస్తానని దయచేసి మా ఇంటికి రావద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు.ఏది ఏమైనా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఈయన మాత్రం భారీ స్థాయిలో పాపులర్ అయ్యారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube