Vijayasai Reddy : టీడీపీ.. జనసేన కూటమికి ఘోర పరాభవం తప్పదు.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఈ వారం లేదా వచ్చే వారంలో ఎలక్షన్ కోడ్ రానుంది.ప్రధాన పార్టీలు ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇదే సమయంలో పలు హామీలు కూడా ప్రకటించేస్తున్నారు.అంతేకాకుండా మేనిఫెస్టో ప్రకటన( Manifesto )పై కూడా సిద్ధపడుతున్నారు.2019 కంటే 2024 ఎన్నికలు చాలా సీరియస్ గా నడుస్తున్నాయి.ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీలోకి దిగుతుంది.తెలుగుదేశం జనసేన పార్టీలు కలసి పోటీ చేయబోతున్నాయి.ఎలాగైనా ఈ ఎన్నికలలో విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

 Tdp Jana Sena Alliance Is Bound To Suffer A Major Defeat Vijayasai Reddy Key Co-TeluguStop.com

ఇదే సమయంలో ఈ కూటమితో బీజేపీ కూడా జతకట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో జనసేన తెలుగుదేశం కూటమిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి( Senior Leader Vijayasai Reddy ) సెటైర్లు వేశారు.వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి( TDP Janasena )కి ఘోర పరాభవం తప్పదని స్పష్టం చేశారు.ఆ కూటమికి అధికారం కలేనని ఎద్దేవ చేశారు.తమ పాలనలో రాష్ట్రంలో 87% కుటుంబాలు లబ్ధి పొందాయి.ప్రజల తలసరి ఆదాయం పెరిగింది.

జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.175 కు 175 సీట్లు సాధించి తీరుతాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.2024 ఎన్నికలలో విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube