నంద్యాల( Nandyala ) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.అదుపుతప్పిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని తెలుస్తోంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు.