Nandyala : నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి
TeluguStop.com
నంద్యాల( Nandyala ) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.అదుపుతప్పిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, నాని సినిమాల మధ్య పోటీ.. 2026లో జరగబోయేది ఇదే!