ఎప్పటిలాగానే వాహనాలు రోడ్డుపై వెళ్తున్నాయి.అయితే ఇంతలోనే ఉన్నట్లుండి నడి రోడ్డు మధ్యలో రోడ్డు కుప్పకూలిపోయింది.
సంఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రంలోని లక్నోలో( Lucknow ) చోటు చేసుకుంది.ఉన్నట్లుండి రోడ్డు మధ్యలో ఓ భారీ బిలం ఏర్పడింది.
అంతేకాదు ఆ రోడ్డుపై కొద్ది దూరం వరకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయి.ఆ బిలం ఏకంగా 30 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతుగా ఏర్పడింది.

అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో ఓ కారు మాత్రమే సంఘటనకు గురైందని చెప్పవచ్చు.కారు ముందు భాగం రోడ్డుపై ఆగి ఉండగా.వెనకల భాగం మాత్రం బిలంలోకి పడిపోయాయి.ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికి సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని ఆ కారుని అక్కడి నుంచి తొలగింపజేశారు.
నిరంతరం రద్దీగా ఉన్న రోడ్డుపై ఈ సంఘటన జరగడంతో లక్నోలోని ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరుపుతామని ఆ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్( State Public Works Department ) తెలిపింది.ఇలా జరగడం రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో ఇది మూడోదని ఆ శాఖ తెలిపింది.ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పిడబ్ల్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆ సంఘటనపై ఆన్ సైట్ తనిఖీలు నిర్వహించి కొన్ని వివరాలను సేకరించారు.
ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్న సీవర్ లైన్ నుండి నిరంతరంగా నీరు లీకేజ్ కావడంతో ఆ రోడ్డు కుంగిపోయినట్లుగా వారు నిర్ధారణకు వచ్చారు.ఆ దెబ్బతిన్న ప్రాంతాన్ని తక్షణ మరమ్మత్తు చేయడం కోసం ఓ ఏజెన్సీకి పనిని అప్పగించారు.
ఏదేమైనా ఈ హఠాత్తు పరిమాణానికి ఎలాంటి ప్రాణహాని కలగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు
.






