Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు( CM Arvind Kejriwal ) ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు వచ్చే నెల 4వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) మనీలాండరింగ్( Money Laundering ) కేసులో భాగంగా ఏడుసార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ( ED ) తాజాగా ఎనిమిదో సారి కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది.

అయితే ఇన్నిసార్లు సమన్లు పంపినా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణ హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఈడీ నోటీసులను చట్ట విరుద్ధంగా జారీ చేస్తుందని కేజ్రీవాల్ పలుమార్లు ఆరోపించారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు