తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి.ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ( Governor Tamilisai )ప్రసంగించారు.
తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని తమిళిసై తెలిపారు.రెండు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో( Free Travel For Women ) ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు.ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెను తొలగించామని చెప్పారు.ప్రజా పాలన( Praja Palana )లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్, రెండు లక్షల ఉద్యోగాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు.మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు.ఈ క్రమంలోనే దావోస్ లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయని తెలిపారు.ప్రజల కొరకు ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు.







