నల్లగొండ జిల్లా:విచక్షణా రహితంగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి,నేల ఆరోగ్యాన్ని ప్రదర్శించడంలో వర్మి కంపోస్ట్ వినియోగం ప్రధానమైనదని కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు( Dr.
S.Srinivasa Rao ) అన్నారు.సోమవారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద చేపట్టిన వానపాముల ఎరువుల తయారీ విధానంపై మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి విజ్ఞాన పరిధిలో సేంద్రియ ఎరువుల తయారీ, వానపాములతో ఎరువుల తయారీ,వినియోగంపై ఈ శిక్షణ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ చంద్రశేఖర్,రాములమ్మ, రజిత తదితరులు పాల్గొన్నారు