సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలంలో గుంజలూరు శివారులో 65వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆగి ఉన్న లారీని వెనకనుంచి కారు ఢీ కొట్టింది.
ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు.ఘటనా స్థలానికి చేరుకున్న చివ్వేంల ఎస్సై విష్ణు ఆధ్వర్యంలో ప్రమాద స్థలి వద్ద క్షతగాత్రులను పోలీసు సిబ్బంది వెలికి తీసి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.