నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గురువారం సాగర్ లోని తన నివాసంలో ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సాగర్ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు.
గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో ఈ సమీక్ష సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఏఈ,డిఈఈ, ఏఈఈ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.