ఏపీలో జగనన్న తోడు డబ్బులు జమ..!

ఏపీలో చిరువ్యాపారులకు జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది.ఈ మేరకు జగనన్న తోడు పథకం కింద ఏపీ సీఎం జగన్ లబ్దిదారులకు డబ్బులు జమ చేశారు.

 Money Is Deposited With Jagananna Scheme In Ap..!...-TeluguStop.com

ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణంను సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేశారు.చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల చేశారు.సుమారు 3.95 లక్షల మంది ఖాతాల్లో రూ.417 కోట్ల వడ్డీలేని రుణాలు జమ అయ్యాయి.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసమే జగనన్న తోడు పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు.సకాలంలో కడితే వడ్డీ భారం కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

చిరు వ్యాపారులను ఆదుకోవడంలో దేశానికే ఏపీ ఆదర్శమని పేర్కొన్నారు.మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని తెలిపారు.ఇప్పటివరకు 16.73 లక్షల మందికి రూ.3,373 కోట్ల లబ్ధి చేకూరింది.ఈ పథకంతో నాలుగు సార్లు చిరు వ్యాపారులు లబ్ది పొందారన్నారు.

అలాగే ఈ పథకంలో భాగంగా లబ్ధిపొందుతున్న వారిలో 87 శాతం మహిళలే ఉన్నారని సీఎం జగన్ వెల్లడించారు.సామాజిక సాధికారతకు ఇదొక నిదర్శనమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube