త్రివిక్రమ్ ( Trivikram )శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా వస్తున్న మూవీ గుంటూరు కారం( Guntur karam ).ఈ సినిమా ఈనెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇంకా అందులో భాగంగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా సంక్రాంతికి వచ్చి మంచి విజయాన్ని అందుకుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఒక మలయాళం సినిమాకి రీమేక్ గా వస్తుంది అంటూ ఇప్పుడు మరికొన్ని న్యూస్ లు కూడా బయటికి వస్తున్నాయి.అయితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.

ఈ ట్రైలర్ ని చూసిన వెంటనే మలయాళం ప్రేక్షకులు ఇది మలయాళం సినిమాకి రీమేక్ లాగా కనిపిస్తుంది అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఒక న్యూస్ ని వైరల్ చేస్తున్నారు.మరి ఈ సినిమాని త్రివిక్రమ్ ఒరిజినల్ స్టోరీ తో చేశాడా, లేదంటే ఏదైనా రీమేక్ స్టోరీ తో చేశాడా అనేది తెలియాల్సి ఉంది.అలాగే తెలుగులో ఈ సినిమా యద్దనపూడి సులోచన రాణి( Yaddanapudi Sulochana Rani ) రాసిన కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా తీశారు అంటూ మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని వాళ్ల కాన్ఫిడెంట్ నీ వ్యక్తం చేస్తున్నారు.ఇక వీళ్ళ కాంబో లో వస్తున్న మూడోవ సినిమా కావడం తో ఈ సినిమా మీద అంచనాలు అయితే తార స్థాయి లో ఉన్నాయి…
.







