మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.తెలంగాణ పదాన్ని చెరిపేసింది కేసీఆరేనని పేర్కొన్నారు.
న్యాయవిచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఏకం అవుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.పారదర్శకంగా విచారణ జరిపేందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని తెలిపారు.
కాళేశ్వరం అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే ఈఎన్సీ మురళీధర్ ను తొలగిస్తేనే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు.
కేసీఆర్ పాలనలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు.ఈ అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ భాగం మాత్రమేనని వెల్లడించారు.







