తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చూపించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ప్రజలకు పాలకులు, అధికారులు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.
జవాబుదారీ, పారదర్శకంగా పని చేస్తున్నామన్నారు.నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల్లో అనేక సమీక్షలు చేశామని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జ్యుడీషియల్ విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరామని తెలిపారు.







